ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు స్వశక్తితో ముందుకెళ్లాలి – మంత్రి ధర్మాన కృష్ణదాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 06:17 PM

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి వారి శ్రేయస్సు కోసం పాటు పడాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆకాక్షించారు. జిల్లా మహిళా సమాఖ్య నూతన కార్యవర్గం నరసన్నపేటలో మంత్రి కృష్ణదాస్ ను సోమవారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా మంత్రి వారిని అభినందిస్తూ ప్రభుత్వ పథకాలపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో చాలా మంది వాటిని వినియోగించుకోవడం లేదని చెప్పారు. అలాంటి వారిని చైతన్యవంతులను చేసి వినియోగించుకునేలా చూడాలని, రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. మహిళా సాధికారతే ద్యేయంగా జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు కలిగి ఉండాలని, అప్పుడే వారు ఆర్థికంగా పురుషులపై ఆధారపడే అవసరం తగ్గుతుందని కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా మహిళా సమాఖ్య నూతన అధ్యక్షురాలు కె.రాజేశ్వరి (పొలాకి), ఉపాధ్యక్షులు పి.కోటీశ్వరి (శ్రీకాకుళం),  కార్యదర్శి డి.సత్యవతి, (సరుబుజ్జిలి), జాయింట్ సెక్రటరీ బి.సరోజనమ్మ (సీతంపేట), కోశాధికారి జె. ఉషారాణి (వజ్రపుకొత్తూరు) తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa