ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ సర్కార్ ప్రజాభిఫ్రాయ సేకరణ ప్రారంభించింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది. రాజధానిపై అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నవాళ్లు.. ఈ-మెయిల్ లేదా లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు కమిటీ కోరింది. అభిప్రాయాలను చెప్పదలచుకున్నవారు.. expertcommitee2019@gamail.com అడ్రస్కు మెయిల్ చేయొచ్చు. విజయవాడలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి లేఖల్ని పోస్టులో పంపాలి. సూచనలు పంపించేందుకు నవంబర్ 12 వరకు గడువుగా నిర్ణయించారు. గత రెండు మూడు నెలలుగా రాజధాని అంశంపై గందరగోళంగా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిపై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. అమరావతి సహా రాష్ట్రంలోని పట్టణాల పురోగతిపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. కమిటీ కన్వినర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావును నియమించారు. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీమోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలంలు ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతి కోసం ఈ నిపుణుల కమిటీ పని చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa