ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవ్వ‌రితోనూ పొత్తుండ‌దు- తేల్చి చెప్పిన మాజీ సిఎం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 09:34 PM

త్వరలో కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకి గాను ఉపన్నికలు జరగనున్న నేప‌థ్యంలోబీజేపీ జెడిఎస్ ల మ‌ధ్య‌ పొత్తు ఉంటుందని వస్తున్న వార్తలను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామి ఖండించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ  కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప ప్రభుత్వం పేద ప్రజలకు సహాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి ప్ర‌భుత్వానికి తాము మ‌ద్ద‌తుగా నిల‌చే ప్ర‌శ్నే లేద‌ని తేల్చిచెప్పారు. ఉపఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగనున్నామని స్ప‌ష్టం చేసారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప‌లువురు శాస‌న‌స‌భ్యులు పార్టీలు మార‌టంపై స్పందిచిన అప్పటి ప్రభుత్వ స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్ నిరోధక చట్టం కింద 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును వేసిన విషయం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa