ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో భారత క్రికెటర్‌గా మంధాన అరుదైన ఘనత.. కోహ్లీకే సాధ్యం కాలేదు

national |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2019, 02:12 PM

ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించడంతో వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన మూడో మహిళా క్రికెటర్‌గా నిలిచింది.


51 ఇన్నింగ్స్‌ల్లోనే మంధాన ఈ అరుదైన మైలురాయి సాధించింది. ఫలితంగా శిఖర్ ధావన్ (48) తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకు రెండో భారత క్రికెటర్‌గా నిలిచింది. కాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత వెస్టిండిస్‌తో జరుగుతున్న సిరిస్‌తో వన్డే జట్టులోకి వచ్చింది.


ఈ క్రమంలో బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో స్మృతి మంధాన 63 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మంధాన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 51 మ్యాచ్‌ల్లో 43.08 యావరేజితో 2025 పరుగులు చేయడంతో... కోహ్లీ (53), గంగూలీ (52), సిద్ధు (52) కంటే అత్యంత వేగంగా వన్డేల్లో 2000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచింది.


మహిళల క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న జాబాతాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బెలిండా క్లార్క్(45 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉంది. బెలిండా క్లార్క్ కేవలం 40 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాదించింది. కాగా, బుధవారం విండిస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత బౌలర్లు జులన్ గోస్వామి, పొన్నమ్ యాదవ్ రాణించడంతో ఆతిథ్య జట్టు 194 పరుగులకే చాపచుట్టేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa