ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టిస్తోంది: కళా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 06:50 PM

ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టిస్తోందని కళా వెంకట్రావు ఆరోపించారు. ఆన్‌లైన్‌లో ఇసుకను వైసీపీ వాళ్లే ఖాళీ చేస్తున్నారని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను మంత్రులు అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు విశాఖలో ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మీడియాపై ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, సీఎస్‌ను ఎందుకు బదిలీ చేశారో ప్రజలకు చెప్పాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, స్పీకర్‌గా ఉన్న వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని కళా వెంకట్రావు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa