ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌ పట్టేసిన తేజస్విని..

national |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2019, 02:16 PM

ఆసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. భారత మహిళా సీనియర్‌ స్టార్‌ షూటర్‌ తేజస్విని సావంత్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. షూటింగ్‌లో ఇది భారత్‌కు 12వ ఒలింపిక్‌ కోటా బెర్త్‌. శనివారం జరిగిన ఆసియా చాంపియన్‌షి మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ ఫైనల్లో తేజస్విని 435.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పతకం చేజారినా.. తుది పోరుకు చేరడంతో టోక్యో బెర్త్‌ దక్కింది. గత మూడు సార్లు (2008, 2012,20 16) అవకాశాలను చేజార్చుకున్న తేజస్విని ఈసారి అద్భుత షాట్లతో ఆకట్టుకుంది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మందిలో ఆరుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అందుబాటులో ఉన్న రెండు బెర్త్‌లలో ఒకటి భారత్‌కు, మరోటి జపాన్‌ (షివోరి)కు లభించాయి. మహారాష్ట్రకు చెందిన 39 ఏళ్ల తేజస్విని క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 1171 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. 2010లో 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా గుర్తింపు పొందిన తేజస్వినికి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa