ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2019, 09:50 PM

అనంతపురం జిల్లా, ధర్మవరంలో పథకాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఏటా చేనేతలకు రూ. 24 వేలు ఆర్థిక సాయం అందుతుంది.  85వేల చేనేత కుటుంబాలు లబ్దిపొందనున్నారు.
అంతే కాకుండా ఈ వైఎస్‌ఆర్‌ నేతన్న పథకాన్ని జిల్లా స్థాయిలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభిస్తారని చేనేత, జౌళిశాఖ ఏడీ కె.అప్పారావు గురువారం తెలిపారు. ఆచంట మండలంలోని ఆచంట వేమవరంలో జరిగే కార్యక్రమంలో ఈ మేరకు పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఎంపీలు, శాసనసభ్యులు హాజరవుతారన్నారు. లబ్ధిదారులు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సొంత మగ్గం కలిగి, నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థికసాయం ఈ పథకం కింద అందిస్తారు.
ఇంకా జిల్లాలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని పొందూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో ప్రారంభించనున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ పద్మ తెలిపారు. గురువారం పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21న ధర్మవరంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని, అదే రోజున ఇక్కడ చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,457 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa