ఐపీఎల్ 2020 ఆటగాళ్ల వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 17 కోట్లతో వేలంలోకి వచ్చినప్పటికీ.. సీనియర్, స్టార్ క్రికెటర్ల జోలికి వెళ్ళకుండా ఉంది..దీంతో యువ క్రికెటర్లని కొనుగోలు చేయడం ద్వారా జట్టులో సమతూకం తెచ్చే ప్రయత్నం చేసింది. భారత్ అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్ తదితరుల్ని కొనుగోలు చేయడం ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. వేలంలో కేవలం ఏడుగుర్ని మాత్రమే కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. రూ. 6.90 కోట్లతో అత్యంత తక్కువగా వేలంలో వెచ్చించిన ఫ్రాంఛైజీగా నిలిచింది.
సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, జానీ బెయిర్స్టో, సాహా (వికెట్ కీపర్), శ్రీవాత్సవ గోస్వామి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్, సదాబ్ నదీమ్, బిల్లీ స్టాన్లేక్, బసిల్ థంపీ, నటరాజన్, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గె, మిచెల్ మార్ష్, సందీప్, అలెన్, అబ్దుల్, సంజయ్ యాదవ్ వేలం తొలి సెషన్ ఆఖర్లో విరాట్ సింగ్ని రూ. 1.9 కోట్లకి కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత.. ప్రియమ్ గార్గెని కూడా అదే ధరకి దక్కించుకుంది. ఇద్దరూ కనీస ధర రూ. 20 లక్షలతో వేలంలోకి రావడం విశేషం. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ మార్ష్ని రూ. 2 కోట్లకి కొనుగోలు చేయడం ద్వారా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకున్న సన్రైజర్స్.. సందీప్ (రూ. 20 లక్షలు), పాబిన్ అలెన్ (రూ. 50 లక్షలు), అబ్దుల్ సమద్ (రూ. 20లక్షలు), సంజయ్ యాదవ్ (రూ. 20 లక్షలు)లను కొనుగోలు చేసింది. సీనియర్ హిట్టర్ యూసఫ్ పఠాన్ని వేలంలోకి వదిలిపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. అతని స్థానాన్ని మాత్రం ఎవరితోనూ భర్తీ చేయలేదు. వేలంలో ఆఖరిగా యూసఫ్ పఠాన్ రూ. కోటికే వస్తున్నా.. అతడ్ని కొనుగోలు చేసేందుకు సన్రైజర్స్తో పాటు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు. దీంతో.. అతను అమ్ముడుపోని క్రికెటర్గా మిగిలిపోయాడు. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో ఉండగా.. మిడిలార్డర్ విలియమ్సన్; మనీశ్ పాండే ఆడనున్నారు. కానీ.. వీరి తర్వాత టీమ్లో నిలకడగా బ్యాటింగ్ చేసేది ఎవరు..? అనేది దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. నిషేధం కారణంగా బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా టీమ్కి దూరమైన విషయం తెలిసిందే. ఇతని స్థానాన్ని కూడా సన్రైజర్స్ భర్తీ చేసే ప్రయత్నం చేయకపోవడం కొసమెరుపు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa