ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికేంద్రీకరణకే జీఎన్ రావు కమిటీ ఓటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2019, 09:57 PM

ఆంధ్రప్రదేశ్ లో పాలన సౌలభ్యం కోసం నాలుగు రీజియన్ లు ఏర్పాటు చేయాలని సిఫారసు చేశామని జిఎన్ రావు తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని అన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందచేసేందుకు కర్నాటక తరహాలో నాలుగు రీజియన్ లు ప్రతిపాదించామన్నారు. అమరావతిలో అసెంబ్లీ కొనసాగించి, నదికి దూరంగా ఉన్న మంగళగిరి ప్రాంతంలో పాలన భవనాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. వరద ముంపు లేని ప్రాంతంలో రాజధాని నగరం ఏర్పాటు చేయాలని సూచించారు. సుమారు 5వందల పేజీలతో నివేదిక రూపొందించామన్నారు.
కమిటీ సభ్యులందరం రాష్ట్రంలోని 13 జిల్లాలు, పదివేల ఆరువందల కిలోమీటర్లు తిరిగి అందరినీ కలిశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలనేది సిఫారసు చేశాం. 2 వేల మంది రైతులతో నేను స్వయంగా మాట్లాడాను అని అన్నారు. అమరావతిలో హైకోర్టు బెంచ్, లెజిస్లేటివ్ క్యాపిటల్, గవర్నర్ రాజ్ భవన్, మినిష్టర్స్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. అలాగే విశాఖపట్నంలో సచివాలయం, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంప్ ఆఫీసు, సమ్మర్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదించాం. కర్నూలు లో హైకోర్టు, అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు లో హైకోర్టు ఉండాలని సూచించాన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa