జననేత ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ముందుగా ఇబ్రహీంపట్నం మండలం కేతనకోండ, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
ఇబ్రహీంపట్నం లో కనకదుర్గ అమ్మవారి అలయంలో 1001 కొబ్బరికాయలు కొట్టి మెక్కు చెల్లించారు. అనంతరం వృదాశ్రమంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఆర్ టీ సి డిపో లో కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో వాలంటీర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్ని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంజనేయ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాత గేటు సెంటర్ లో బిసి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు
గుంటుపల్లి గ్రామంలో....
గుంటుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జననేత ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలడుగు దుర్గా ప్రసాద్ వితరణతో ఏర్పాటు చేసిన యూనిఫాంలు పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ. ..ముఖ్యమంత్రి హోదాలో జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. పేదల దేముడు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు ముందు చూపుతో ప్రవేశపెట్టిన పధకాలను అర్హత ఉన్న ప్రతి పేదవానికి అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa