సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో భారత్, వెస్టిండీస్ జట్లు ఇవాళ కటక్ వేదికగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా దీపక్ చాహర్ ఈ మ్యాచ్కు దూరమవడంతో అతని స్థానంలో నవదీప్ సైనీ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్పై పదవ ద్వైపాక్షిక సిరీస్ సాధించాలనే లక్ష్యంతో కోహ్లీసేన కనిపిస్తుంటే మరోవైపు 13 ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న సిరీస్ గెలుపును ఈసారైనా ఒడిసిపట్టుకోవాలని విండీస్ పట్టుదలతో ఉన్నది. చెన్నై పోరులో ఓడినా విశాఖ వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియా అదరగొట్టింది. బారాబతి పిచ్పై మరోసారి విశ్వరూపం చూపాలని బ్యాట్స్మెన్ తహతహలాడుతుంటే.. హ్యాట్రిక్ హీరో కుల్దీప్ యాదవ్ తిప్పేయాలని వేచిచూస్తున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ద్వైపాక్షిక సిరీస్ల్లో భారత్ చేతిలో ఎదురవుతున్న పరాజయాల పరంపరకు ఫుల్స్టాప్ పెట్టాలని విండీస్ భావిస్తున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa