ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుందూనది వరదను నివారిస్తాం : జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 02:36 PM

కుందూనది వరదను నివారిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలోని నేలటూరు వద్ద కుందూనదిపై మూడు రిజర్వయార్లకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రాయలసీమలో ప్రాజెక్టులు నిండలేదన్నారు. గండికోట రిజర్వాయర్లోకి 12 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు. గత  ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే డ్యామ్ లను నింపుకోలేకపోయామన్నారు. ప్రాజెక్టుల రూపురేఖలను మార్పు చేస్తామన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు నిండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు తీసుకెళ్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa