ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు సమ్మె జయప్రదం చేయాలి: సీపీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 12:39 PM

వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని ప్రజా సంఘాల కార్యాలయంలో సోమవారం వేముపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం పార్టీ సమావేశంలో జిల్లా తూర్పు కమిటీ రైతు సంఘం కార్యదర్శి జొన్నా శివశంకర్ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ,నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పడంతో పాటు పేదలకు రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్నారన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఆర్టికల్ 370 ప్రవేశ పెట్టి ప్రజల మధ్య చిచ్చు రేకెత్తించా రని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజల బాధలు చూడకుండా రాజధాని రగడగా మార్చి మూడు రాజధానులుగా వికేంద్రీకరణ చేపడతామంటూ ప్రజల ఆలోచన పక్కదారి పట్టిస్తుందని, ఆయా విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు, కార్మి క సంఘాలు జనవరి 8న తలపెట్టిన సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కృష్ణ, సంఘ మండల కార్యదర్శి టి.సురేష్,పార్టీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa