ఏపీకి మూడు రాజధానులు అవసరమని అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే జీఎన్ రావు కమిటీ సైతం మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రతిపాదించింది. ఈ నెల 27న జరిగే మంత్రి మండలి సమావేశంలో రాజధాని కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి బొత్స స్పష్టం చేసారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతిలో భూములిచ్చిన రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలు రోజురోజుకు పెరుగుతుండటంతో రాజధానిపై జగన్ మరో సంచలన ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. 27న జరిగే కేబినేట్ భేటి వైజాగ్ లో జరనుందని తెలుస్తోంది. అదే వేదిక నుంచి సీఎం జగన్ రాజధాని ప్రాంతానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయనున్నారని సమాచారం. దీంతో సీఎం జగన్ ప్రకటన తర్వాత ఎలాంటి గొడవలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి రిజర్వ్ పోలీస్ బెటాలియన్లను అమరావతికి తరలిస్తున్నారు. తాజాగా అమరావతిలోని యర్రబాలెంతో పాటు ఇతర కళ్యాణ మండపాల్లో పోలీసు బలగాలకు వసతి కల్పించినట్లు సమాచారం. అయితే రాజధాని మార్పుపై సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa