ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అభివృద్ది వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ల పై హైకోర్టు విచారించింది. దీనికి సంబంధించిన వివరాలను అటార్నీ జనరల్ ను అడిగి సీజే తెలుసుకున్నారు. అనంతరం సీజే బిల్లుల పై విచారణ అవసరం లేదన్నారు. దీంతో వెంటనే పిటిషనర్ తరపున లాయర్ కలుగజేసుకొని బిల్లుల పై విచారించాలని కోరారు. లేకపోతే ప్రభుత్వం ప్రధాన కార్యాలయాలను తరలించే అవకాశం ఉందని అన్నారు.
దీని పై స్పందించిన సీజే తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాలను అమరావతి నుంచి తరలించవద్దని ఆదేశించారు. ఒకవేళ తరలిస్తే చట్టపరంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అనంతరం సీజే విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేశారు. ఓ వైపు మండలిలో బిల్లులు తిరస్కరణకు కావడం, మరో వైపు హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని అనడంతో సీఎం జగన్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయ్యిందని అంతా చర్చించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa