ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30న భీమేశ్వరాలయం లో ఘనంగా సరస్వతి దేవి పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 08:27 AM

ఈ నెల 30న పంచారామక్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వర ఆలయంలో శ్రీ పంచమి సరస్వతి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వయంభూగా ఉన్న సరస్వతి అమ్మవారికి ఘనంగా పంచామృత అభిషేకాలు హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇవో పులి నారాయణ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వర ఆలయంలో ఉన్న సరస్వతి అమ్మవారికి ఈ నెల 30న గురువారం ఉదయం 8:30 గంటల నుండి పంచామృత అభిషేకం పూజలు సరస్వతి హోమం మరియు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులచే సరస్వతీ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు సరస్వతి రూపును దేవస్థానం మరియు దాతల సహకారంతో అందిస్తున్నట్లు తెలిపారు ఇంకా భక్తులు ఎవరైనా సరే ఈ పూజల సందర్భంగా వంద రూపాయలు చెల్లిస్తే వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించబడతాయన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీతా విశ్వనాధ్ సామర్లకోట పి ఏ సి ఎస్ చైర్మన్ దవులూరి దొర బాబు అతిథులుగా పాల్గొంటారన్నారు. పూజల అనంతరం విద్యార్థులకు మధ్యాహ్నం అన్నదాన కమిటీ వారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.ఈ సమావేశంలో ఆలయ అర్చకులు సన్నిధి రాజు సుబ్బన్న సన్నిధిరాజు వెంకన్న తదితర అర్చకులు పాల్గోన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa