ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాశ్వత రాజధానిగా అమరావతే ఉంటుంది: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2020, 07:56 PM

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని మార్చడం అంత తేలిక కాదని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. బేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని అంశంపై నిర్మలా సీతారామన్‌తో చర్చించామని చెప్పారు. 3 రాజధానులకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేదన్నారు. ఏపీలో ప్రభుత్వాలు మారినా పనితీరు మారలేదన్నారు. కేంద్రాన్ని భ్రష్టుపట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-జనసేన కలిసి బలమైన కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ తెలిపారు. ఏపీలో శాశ్వత రాజధాని అమరావతే ఉంటుందన్నారు. రాజధాని ప్రాంత రైతులకు తాము అండగా ఉంటామని అన్నారు. తొలుత విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలు అన్న ప్రభుత్వం.. ... ప్రజా వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందన్నారు. ఆ విధంగా ప్రజా ఉద్యమంతో రాజధాని తరలింపు విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా పోరాడుతామని పవన్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa