ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో తగ్గిన కరోనా మరణాల రేటు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 31, 2020, 12:35 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు మరింత తగ్గింది. దేశవ్యాప్తంగా సగటు మరణాలు 2.86 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 1.73 శాతంగా నమోదైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 60గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 55 మందిని డిశ్చార్జి చేయడంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,281కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,120గా ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 9,504 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 131 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa