ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి కొత్త రూల్స్

national |   | Published : Mon, Jun 01, 2020, 09:34 AM

జూన్ నెలలోకి అడుగు పెట్టేశాం. ఈరోజు ఒకటో తేదీ. దీంతో ఈరోజు నుంచి చాలా అంశాలు మారబోతున్నాయి. దీంతో ప్రజలపై నేరుగానే ప్రభావం పడనుంది. రైల్వేస్, బస్సులు, రేషన్ కార్డ్స్, ఎయిర్‌లైన్స్ వంటి వాటికి సంబంధించి పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. జూన్ 1 నుంచి మారే అంశాలు ఏంటివో ఒకసారి చూద్దాం..


1. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమ్ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఈరోజు నుంచే అమలులోకి రానుంది. దీంతో 20 రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కడికైనా వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవడం వీలవుతుంది. దీంతో పేద ప్రజలకు, వలస కూలీలకు ప్రయోజనం కలుగనుంది.


2. ఇండియన్ రైల్వేస్ ఈరోజు నుంచి 200 ట్రైన్స్‌ను అదనంగా నడుపనుంది. ఇవ్వన్నీ నాన్ ఏసీ ట్రైన్స్. జూన్ 1 నుంచి ప్రతి రోజూ 200 ట్రైన్లు తిరుగుతాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.


3. పెట్రోల్ బాదుడు మొదలైంది. చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచుతున్నాయి. మహరాష్ట్ర, మిజోరం వంటి రాష్ట్రాలు వ్యాట్ పెంచేశాయి. దీంతో మహరాష్ట్రలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 పెరగనున్నాయి.


4. ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ ఈరోజు నుంచే దేశీ విమాన సర్వీసుల బుకింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎయిర్‌లైన్స్‌తోపాటు ప్రయాణికులు కూడా ఫ్లైట్స్‌లో జర్నీ చేయాలంటే పలు రూల్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది.


5. మధ్యతరగతి ప్రజలకు షాక్. కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్యాస్ సిలిండర్‌ ధర పెంచేసింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.110 వరకు పెరిగింది. ఈరోజు పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa