ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే బోర్డు చైర్మన్ కు లేఖ రాసిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 01, 2020, 09:44 AM

విజయవాడ: రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ కు లేఖ రాసిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు శ్రామిక్ రైళ్లు నడిపి లక్ష మందికి వారి గమ్య స్థానాలకు చేర్చటం పై అభినందనలు తెలిపిన సీఎస్. రైల్వేశాఖ నడుపనున్న 200 ప్రత్యేక రైళ్లలో 11 జతల సర్వీసులు రాష్ట్రం నుంచి వెళ్తున్నందున వాటి హల్టులను మార్చాలని కోరుతూ లేఖ. రైళ్ల ద్వారా ప్రయాణించే వారందరికీ టెస్టులు చేయడం కష్టమవడంతో.,  హల్టులను పరిమితం చేయాలని లేఖలో కోరిన సీఎస్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రైల్వేస్టేషన్ల లో కోవిడ్ పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసి ఉన్నందున వాటికే హల్టులను పరిమితం చేయాలని కోరిన ఏపీ సీఎస్*


సికింద్రాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ ప్రెస్ రైలును ఏపీలో విజయవాడ,రాజమహేంద్ర వరం స్టేషన్లు.గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ ప్రెస్ ను విజయవాడ, గుంటూరు స్టేషన్లురాయల సీమ ఎక్స్ ప్రెస్ ను కడప, గుంతకల్ స్టేషన్లు,ఢిల్లీ-  విశాఖ ఏపీ ఎక్స్ ప్రెస్ ను విజయవాడ, రాజ మహేంద్రవరం స్టేషన్లు, కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను విజయవాడ, విశాఖ స్టేషన్లలో మాత్రమే నిలుపుదల చేసేలా చూడాలని కోరిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa