ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలకలం రేపుతున్న ఓ యువకుడి... సజీవ దహనం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 02:23 PM

ఓ యువకుడిని స్థానికులు సజీవ దహనం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో కలకలం రేపింది. భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్ అనే యువకుడు  ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆ మహిళకు సంబంధించి ఓ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు.


దాన్ని చూసిన ఆ మహిళ బంధువులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. తమ వర్గానికి చెందిన మహిళతో అతడు సన్నిహితంగా ఉంటున్నాడని ఆ మహిళ బంధువులు ఈ రోజు ఉదయం ఆ యువకుడిని ఇంటి నుంచి బటయకు లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి చావబాదారు. ఆ తర్వాత అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి నిరసకు దిగి, పోలీసుల‌ వాహనాలను దగ్ధం చేయడం అలజడి రేపింది. దీంతో పోలీసులు అదపను బలగాలను పిలిపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa