నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా మళ్లీ బాధ్యతలు చేపట్టడంపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ లాంటి వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉంటే ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయదని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎస్ఈసీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అయితే, నిమ్మగడ్డ పదవి నుంచి దిగిపోయాడని చంద్రబాబు రెండు డజన్ల మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపాడని ఆరోపించారను. నిమ్మగడ్డ కోసం ఆయనెందుకు హైరానా పడుతున్నాడో అర్థం కావడంలేదని విజయసాయి ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa