ఏపీలో ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి రూ.10వేలు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్ తెలిపారు. డ్రైవర్లు నేరుగా గ్రామ, వార్డు సచివాలయంలో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులని తేలితే వచ్చే నెల 4న డబ్బు జమ చేస్తామన్నారు. వాహన మిత్ర పథకాన్ని పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ రూ.10వేలను వాహనం ఇన్సూరెన్సు, ఎఫ్సీ కోసం ఖర్చు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ముఖ్యమంత్రి జగన్ కోరారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే ఆర్థిక సాయం కింద రూ.10వేలు అందించారు. మొత్తం రూ.262.495 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్లైన్ చెల్లింపులు చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa