రిలయెన్స్ జియో మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. '4ఎక్స్ బెనిఫిట్స్ ఆఫర్' అంటే నాలుగు రెట్లు లాభాలు పొందండి అంటూ యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆఫర్ జూన్ నెల వరకే ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తే సాధారణంగా వచ్చే ప్రయోజనాలతో పాటూ మరిన్ని లాభాలు పొందొచ్చు. యూజర్లు ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్వేర్పై డిస్కౌంట్స్ పొందొచ్చు. రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసేవారికి డిస్కౌంట్ కూపన్స్ లభిస్తాయి. వాటిని రిలయెన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్ ఫుట్వేర్, ఏజియోలో ఉపయోగించి డిస్కౌంట్ పొందొచ్చు. రూ.249 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేయగానే మైజియో యాప్లో కూపన్స్ సెక్షన్ లో డిస్కౌంట్ కూపన్స్ క్రెడిట్ అవుతాయి. అడ్వాన్స్ రీఛార్జ్ చేసేవారు కూడా ఈ ఆఫర్స్ పొందొచ్చు. అంటే మీ ప్రస్తుత ప్లాన్ వేలిడిటీ పూర్తి కాకపోయినా రీఛార్జ్ చేయొచ్చు. మైజియో యాప్లో మై ప్లాన్స్ సెక్షన్లో మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్ క్యూలో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa