కోవిడ్-19 పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ . నాలుగు లక్షలు దాటిన టెస్ట్ లు. కోవిడ్-19 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షల మార్కును దాటింది. జూన్ 4 2020 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలు 4,13,773 లక్షలు కి చేరాయి. ఇందులో 4112 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 3377 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 616 మంది , విదేశాల నుంచి తిరిగి వచ్చిన 119 మంది ఉన్నారు.మే 1, 2020 నాటికి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ పరీక్షల సంఖ్య లక్ష దాటింది. సరిగ్గా నెల రోజుల్లో ఆ సంఖ్య ఏకంగా 4లక్షలు దాటింది.
దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పరీక్షల సంఖ్య ను మరింత వేగవంతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచడంతో మొత్తం 4,13,733 కోవిడ్ టెస్ట్ ల మైలు రాయిని చేరింది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన కఠినమైన విధానాలతో పాటు ఎప్పటికప్పుడు కోవిడ్-19 పరీక్షలని పెంచుతూ ముందే అప్రమత్తమైంది. ఒక మిలియన్ జనాభాకు ఆంధ్రప్రదేశ్ లో 7748 టెస్ట్ లు జరుగుతుండగా , భారతదేశంలో మన తరువాత 6864 టెస్టుల తో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. దీంతో కోవిడ్ పాజిటివ్ కేసుల రేటు 1 కన్నా తక్కువ శాతం నమోదు అయ్యాయి. అదే సమయంలో అత్యధికంగా డిశ్చార్జ్ రేటు ఉంటోంది. దీనివల్లే కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో ప్రపంచ మరియు జాతీయ సగటుతో పోల్చినపుడు మన రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa