ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ ఏనుగు మృతి కేసులో ఒకరి అరెస్ట్‌

national |  Suryaa Desk  | Published : Fri, Jun 05, 2020, 12:07 PM

 ములప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి కేసులో ఒకరి అరెస్టు చేశామని, మిగతా నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని కేరళ అటవీశాఖ మంత్రి కే రాజు వెల్లడించారు. పైనాపిల్‌ పండులో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న 15 ఏండ్ల ఏనుగు చంపిన ఘటనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై పోలీసు, అటవీశాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 


నోటిలో పేలుడు వల్ల ఏర్పడిన గాయంతో ఏనుగు ఆహారం తీసుకోలేకపోయిందని, నదిలో మునిగి ఊపిరి తిత్తులు విఫలమై అది మరణించిందని పశువైద్యులు పోస్టుమార్టంలో తేల్చారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంకు చెందిన మోహన్‌ కృష్ణన్‌ అనే అటవీశాఖ అధికారి రాసిన ఫేస్‌బుక్‌ పోస్టుతో మే 27 ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏనుగు మృతిపై కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, ఎంపీ మేనకాగాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాతోపాటు పలువులు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తంచేయడంతో కేరళ ప్రభుత్వం ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa