ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 10.15 గంటలకు నగరంలోని శర్మ కాలేజీ, అంబేడ్కర్ భవన్, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఈరోజు ఉదయం ఏపీతో పాటు కర్ణాటక, ఝార్ఖండ్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్లోని జంషెడ్పూర్లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో రిక్టర్ స్కేల్పై 4 తీవ్రతతో భూమి కంపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa