మీ ఆధార్ కార్డులో వివరాలను అత్యవసరంగా మార్చుకోవాలా అయితే మీకిది శుభవార్తే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,000 ఆధార్ కేంద్రాలు తెరిచే ఉన్నాయని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఓ ప్రకటనలో తెలిపింది. పోస్టాఫీసులు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే 14,000 ఆధార్ కేంద్రాలు తెరిచి ఉన్నాయి. ఇక యూఐడీఏఐ స్వయంగా నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల ఆధార్ సేవా కేంద్రాలున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్, వరంగల్లోని నయీంనగర్, విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్నంలోని ద్వారకానగర్లో యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఈ 4 ఆధార్ సేవా కేంద్రాలు తెరిచినట్లు యూఐడీఏఐ ప్రకటించింది. మిగతా ఆధార్ కేంద్రాలను తెరిపించేందుకు స్థానిక ప్రభుత్వాధికారులతో సంప్రదిస్తున్నామని యూఐడీఏఐ వెల్లడించింది . లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఆధార్ సేవా కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వ పథకాలు పొందలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 14,000 ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ సేవా కేంద్రాల్లో సేవల్ని పొందాలనుకుంటే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa