ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈఎస్ఐ స్కామ్ నిందితుల కస్టడీకి ఏసీబీ పిటిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 04:48 PM

ఈఎస్ఐ స్కామ్ నిందితుల కస్టడీకి ఏసీబీ పిటిషన్ వేసింది. మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టుకు కోరింది. ఏపీ  ఈఎస్ఐ స్కామ్ లో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టిడిపి ఎంఎల్‌ఎ కింజరాపు అచ్చెన్నాయుడును గత శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.


ఇఎస్‌ఐలో మందుల, వస్తుసామాగ్రి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఎసిబి అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. టెండర్లు పిలవకుండా నామినేషన్‌ల పద్దతిలో అచ్చెన్నాయుడు చెప్పిన కంపెనీకు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలో తేలింది. మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఎసిబి తేల్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa