ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతపై స్పందించిన చైనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 05:34 PM

లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతపై  చైనా స్పందించింది. మా భూభాగంలోకి భారత సైనికులు చొచ్చుకు వచ్చారని చైనా తెలిపింది. ఈ ఘర్షణలో ఐదుగురు సైనికులు చనిపోయారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. 11 మందికి తీవ్రగాయాలైయ్యాయని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.


ఈ నెల 23న భారత్, చైనా, రష్యా, విదేశాంగ మంత్రుల సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో భారత్- చైనా సరిహద్దు సమస్యను భారత విదేశాంగశాఖ ప్రస్తావించనున్నది.  చైనా-భారత్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి.  గాల్వాన్ వ్యాలీలో భారత్ జవాన్లపై చైనా కాల్పులు జరిపింది. చైనా కాల్పుల్లో ముగ్గురు భారత్ జవాన్లు మృతి చెందారు.  ఆర్మీ ఆఫీసర్ తో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa