ప్రపంచంలోని ప్రతి ఐదుగురిలో ఒకరిని కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టనుందని, సుమారు 170 కోట్ల మంది వైరస్ ముప్పులో ఉన్నారని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పేర్కొంది. పలువురు పరిశోధకులు కరోనాపై ఓ అధ్యయనాన్ని నిర్వహించగా, లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మేగజైన్, దీని వివరాలను ప్రచురించింది. భూ మండలంపై ఉన్న మొత్తం జనాభాలో 22 శాతం మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారని, వారికి వైరస్ సోకితే ప్రమాదకరమని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa