ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలుగుదేశం నేతల ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 02:55 PM

అచ్చెన్నాయుడు అరెస్టు తీరు పై ఫిర్యాదు చేసిన టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు. జేసీ కుటుంబ సభ్యులు అరెస్టు లై ఫిర్యాదు చేసి ఎమ్మెల్సీ గౌరివాణి శ్రీనివాసులు. వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ వాదాన్ని సాగిస్తోందని మండిపాటు. ప్రభుత్వ ప్రతీకార చర్యలతో  మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలు, క్యాడర్ పై హింస కొనసాగిస్తోంది. తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.


ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు ని అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టులో వైకాపా ఆదేశాలకు అనుగుణంగా ఎసిబి అధికారులు వ్యవహరించారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదు. శస్త్రచికిత్స గాయం తో బాధపడుతున్న అచ్చెన్నాయుడు ను శ్రీకాకుళం నుండి దాదాపు 600 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణింప చేశారు. అరెస్టు అమానుషమే కాకుండా


 సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. వైకాపా వ్యూహాలను అనుసరిస్తూ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు గా అరెస్టు తీరు  సాధించింది. 


తమ ఒత్తిళ్ళకు లొంగని పార్టీ నేతలను ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వారిని అరెస్టు చేసింది. ఇందులో భాగంగా నే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అష్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారుప్రతీకారం తీర్చుకోవాలనే తపనతోనే ఈ అరెస్టు లు జరిగాయి. రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన లో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేతల విజ్ఞప్తి


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa