ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైస్ ఫోర్టిఫికేషన్ స్కీమ్ ప్రారంభం... 81 కోట్ల మందికి ప్రయోజనం!

national |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 02:55 PM

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. వారికి బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాన్ పాశ్వాన్ తాజాగా రేషన్ కార్డు కలిగిన వారికి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తామని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం దీని కోసం రైస్ పోర్టిఫికేషన్ స్కీమ్‌ను తీసుకువచ్చిందని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. 15 రాష్ట్రాల్లో ఈ స్కీమ్‌ను పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయడానికి మోదీ సర్కార్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ స్కీమ్‌ కింద పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ (ఏపీ), గుజరాత్, మహారాష్ట్రల్లో న్యూట్రిషన్ రైస్ అందించడం ప్రారంభించామని తెలిపారు.ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అతిత్వరలో ప్రారంభం కానుంది. ఇక ఇతర రాష్ట్రాలను కూడా కేంద్రం ఈ స్కీమ్‌ను అమలు చేయాలని కోరింది. కాగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 81 కోట్ల మంది రేషన్ కార్డు లబ్దిదారులకు ఈ ప్రయోజనాన్ని అందించనుంది.రైస్ ఫోర్టిఫికేషన్‌లో భాగంగా రేషన్ కార్డుదారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి పోషకాలు కలిసిన బియ్యాన్ని అందిస్తారు. దీంతో అనేమియా, సూక్ష్మపోషకాల లేమి వంటి వ్యాధులను నుంచి రక్షణ లభిస్తుంది. 15 రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో రైస్ పోర్టిఫికేషన్‌ను పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు అవుతుందని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa