ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మరిని నిలువరించే క్రమంలో ఓ అడుగు ముందుకు పడినట్లైందని వినవస్తోంది. బ్రిటన్కు చెందిన మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనాతో బాధపడుతూ వెంటిలేటర్పై ఉన్న రోగులను కూడా కాపాడవచ్చని ఆ మీడియా పేర్కొంది.
‘డెక్సామెథాసోన్’ అనే ఈ మందును వినియోగించినపక్షంలో... దాదాపు మూడొంతుల మంది కరోనా రోగులు అనారోగ్యం నుంచి బయట పడ్డారని తెలిపింది. కరోనా కారణంగా రిస్క్ స్టేజ్లో ఉన్నవారిలో కొందరికి ఈ ఔషధాన్ని వినియోగించడం జరిగిందని, వారు కరోనాను జయించి, ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించింది.
కాగా... కరోనాకు ఇప్పటివరకు... భారతదేశంలోనౌతే హైడ్రాక్సిక్లోరోక్విన్ తో పాటు మరికొన్ని ఇతర మందులను, కొని్న ఇతర దేశాల్లో యాంటీ వైరల్ డ్రగ్స్ను, ఇంకొన్ని దేశాలు ఇతరత్రా మందులను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వెలుగులోకి వచ్చిన డెక్సామెథాసోన్ ఎంతవరకు ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa