వైసీపీ అధికార ప్రతినిధి అయిన అంబటి రాంబాబు మరోసారి టీడీపీపై ఫైర్ అయ్యారు. "చంద్రబాబు విచిత్రంగా తయారయ్యారు. హైదరాబాద్ నుంచి కదలడు, జూమ్ నుంచి బయటికి రాడు లోకేష్ ట్విట్టర్ వదలడు. వాళ్లిద్దరూ ఏపీకి ప్రవాసులు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ విఫలమైంది. ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదు" అని అంబటి అన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.60వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఇచ్చిందన్న అంబటి... రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.4వేల కోట్లను ఆదాచేసినట్లు తెలిపారు. దళితులపై దాడి అంశంపై ప్రసావించిన అంబటి... దళితులపై దాడులు చేసిన వారి తాట తీస్తామని సీఎం జగన్ హెచ్చరించారనీ... దళితులపై దాడులు చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని అన్నారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ నమోదైన పిల్పై ఆయన స్పందించారు. "నేను అక్రమ మైనింగ్ చేస్తున్నానని పిల్ వేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపినా, లేక సీబీఐతో విచారణ జరిపించినా... దేనికైనా నేను సిద్ధం" అన్నారు అంబటి. తనపై వేసిన పిల్ వేసిన వారు మైనింగ్ దొంగలన్న ఆయన... తనపై కేసు వేసినవారితోపాటూ... మరో ఐదుగురిపై కేసు నమోదైందని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానన్న అంబటి... తన నియోజకవర్గంలో ఎలాంటి అవకతవకలూ జరగలేదన్నారు. అధికారులు, తనను బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో కేసులు వేశారనీ... నిరాధార ఆరోపణలకు తాను భయపడేది లేదన్నారు అంబటి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa