ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ పద్మనాభ ఆలయంలో భారీ చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2017, 11:57 AM

తిరువనంతపురం: ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదతో పేరుగాంచిన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో. భారీ చోరీ జరిగింది. ఒక విగ్రహానికి తిలక ధారణకు అలంకరించే అత్యంత విలువైన 8 పురాతన వజ్రాలు మాయమయ్యాయి. వీటి ధర మార్కెట్‌లో కొన్ని కోట్ల రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు.ఈ వజ్రాల చోరీ సంఘటనను న్యాయమిత్ర గోపాల్ సుబ్రహ్మణ్యం సోమవారం సుప్రీంకోర్టుకు, కేరళ పోలీసులకు తెలియజేశారు. కాగా, ఈ వజ్రాలు ఆలయంలో ప్రతీరోజూ జరిగే అనుష్ఠానానికి వినియోగిస్తారు.ఈ విలువైన వజ్రాలు మాయమైనట్టు ఆలయ మాజీ కార్యనిర్వహణాధికారి కెఎన్ సతీష్ గుర్తించి రికార్డుల్లో నమోదు చేశారు. ఈ వజ్రాలు మాయమైన సంగతి... 2015 నాటి ఆలయ రికార్డులను తనిఖీ చేసినప్పుడు వెల్లడైంది. కాగా, 2016 లో ఈ చోరీ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.వజ్రాల గల్లంతు నేపధ్యంలో ఆలయ కమిటీ దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యం వహించింది. పైగా ఆ వజ్రాలు మాయం కాలేదని, వేరే చోటుకు తరలించామని అప్పుడు చెప్పుకొచ్చింది. కాగా 10 నెలల క్రితం ఆడిట్ నిర్వహించిన సందర్భంలో 189 కోట్ల రూపాయల విలువైన బంగారం మాయమైందని అధికారులు గుర్తించారు. దీనిపై కోర్టుకు వారు రిపోర్టు అందజేస్తూ.. ఆలయంలో 776 కిలోల బంగారం మాయమైందని తెలిపారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa