ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి క్షమాపణలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్ పట్ల తనకు చాలా గౌరవం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే రాజ్యసభ చైర్మన్ పై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యసభ చైర్మన్ ను అగౌరవ పరచాలని తనకు లేదని ఆవేశంలో మాట్లాడినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
తన వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో ఇలా జరగదని హామీ ఇచ్చారు. ప్రహ్లాద్ జోషి ఆదేశాల మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి క్షమాపణలు చెప్పారు. ఇకపోతే సభలో సీఎం జగన్ పై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. అయితే విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను వెంకయ్యనాయుడు తిరస్కరించారు.
దీంతో వైసీపీ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చారు. ఈ సందర్భంగానే చైర్మన్ పై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి చైర్మన్ వెంకయ్య నాయుడిపై విమర్శలు చేశారు. ఈ విమర్శలపై వెంకయ్యనాయడు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరి వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయసాయిరెడ్డిని మందలించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa