ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో కేసులో ఇరుక్కున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 11, 2021, 10:44 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన నాటినుండి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పడరాని పాట్లు పడుతున్నాడు. వరుస కేసులలో చిక్కుకుంటూ నానా అగచాట్లు పడుతున్న చింతమనేని ప్రభాకర్ మీద తాజాగా మరో కేసు నమోదైంది.పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి, అధికారుల అనుమతులు తీసుకోకుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన కారణంగా చింతమనేని ప్రభాకర్ పై బుధవారం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది.


ఇక ఈ విషయాన్ని ఏలూరు డిఎస్పి డాక్టర్ దిలీప్ కిరణ్ వెల్లడించారు. పెదవేగి మండలం వేగివాడలో టిడిపి కార్యకర్తలతో కలిసి చింతమనేని ప్రభాకర్ ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఎవరైనా ర్యాలీ నిర్వహించాలి అంటే ఎన్నికల సంఘం నుండి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కానీ చింతమనేని ప్రభాకర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.


దీంతో చింతమనేని ప్రభాకర్ పై, కొంతమంది టీడీపీ కార్యకర్తలపై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ ను , కార్యకర్తలను పెదవేగి పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ నిర్వహించిన పోలీసులు ఆయనకు 41 ఏ కింద నోటీసు అందజేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కూడా చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసులు నమోదు చేశారు . ఇప్పటికే ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పదుల సంఖ్యలో కేసులు చింతమనేని ప్రభాకర్ పై ఉన్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa