ఓ ఎంబీఏ విద్యార్థిని హత్య కేసును పోలీసులు చేధించారు. ఆమె తమ్ముడే ఈ హత్య చేసినట్టు విచారణలో తేలింది. ఓ అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న అతడు.. ఆ కేసు నుండి తప్పించుకునేందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని అమ్రోహ జిల్లాలో జరిగింది. న్యూస్ 18 కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
అమ్రోహ జిల్లాలో ఓ దళిత బాలికపై జనవరి 18న సామూహిక అత్యాచారం జరిగింది. ఆ కేసులో అంకిత్(22) నిందితుడిగా ఉన్నాడు. అతని అక్క నేహ చౌదరి(24) ఎంబీఏ చేస్తూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే అంకిత్.. ఈ కేసు నుంచి బయటపడేందుకు తన అక్కను చంపాలనుకున్నాడు. అలా చేసి ఆ నేరాన్ని సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబంపై నెట్టాలనుకున్నాడు. ఇలా చేయడం ద్వారా వారిని కాంప్రమైజ్ డీల్ కి ఒప్పిద్దామని భావించాడు.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అంకిత్ తన అక్కను గొంతుకోసి చంపాడు. ఆమె ముఖాన్ని గుర్తుపట్టలేకుండా ఇటుకతో చెక్కాడు. ఆ తర్వాత రక్తపు మరకలు అంటిన తన బట్టలను పొదల్లో పడేసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహం సమీపంలో పడి ఉన్న బ్యాగ్ లో 2 మొబైల్ ఫోన్లు, ఓటర్ ఐడీ గుర్తించారు. దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ లో అంకిత్ నేహాను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం అంకిత్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. అతను నేరాన్ని అంగీకరించాడు. జనవరి 18న జరిగిన అత్యాచారం కేసులో అంకిత్, అతని కజిన్స్ నిందితులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa