ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బనగానపల్లె లో క్షుద్రపూజలు కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 12, 2021, 02:54 PM

కర్నూలు జిల్లా బనగానపల్లె లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. 150 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో గుప్తనిధుల కోసం ఇంటి యజమాని క్షుద్రపూజలు జరుపుతున్నాడు. దాంతో కాలనీ వాసులు భయాందోళనలు చెందుతున్నారు.పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో తాళం వేసి పరారయ్యారు ముఠా సభ్యులు. కంటి మీద కునుకు లేకుండా పోయిందని కాలనీ వాసులు గొల్లుమంటున్నారు. బనగానపల్లె పట్టణంలోని కొండపేట శివాలయం సమీపంలో... 150 ఏళ్ల నాటి పురాతన మైన పాడుబడిన ఇంట్లో కొద్దిరోజులుగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో బిత్తరపోయారు. ఇరుగుపొరుగిళ్ళ వారు పోగవ్వడంతో సంగతిని గమనించిన క్షుద్ర పూజల ముఠా,పాడుబడిన ఇంటిని తాళం వేసి, పరారైయ్యింది. 150 ఏళ్ల నాటి పురాతన ఇంటిలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన, రవి తేజ అనే వ్యక్తి 6 నెలల క్రితం కొనుగోలు చేశాడు. పలువురు తాంత్రికులు , మంత్రగాళ్ళను తీసుకొని వచ్చి, చూపిస్తున్నా కూడా అప్పట్లో కాలనీవాసులు ఏమాత్రం పట్టించుకోలేదు. నాలుగు రోజులుగా పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి.. నిమ్మ కాయలు దీపాల ప్రమిదలు వెలిగించి..


 


ఇతర సామాగ్రితో పూజలు నిర్వహిస్తుండగా , గుప్తనిధుల కోసం చేస్తున్న , క్షుద్ర పూజల వ్యవహారం బట్టబయలైంది. రాత్రి చేసిన క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా , ఇంటి యజమాని రవితేజ తన గుమస్తా తో ఉదయమే,నీళ్ళ తో కడిగించేందుకు ప్రయత్నించారు. కాలనీ వాసులు నిలదీయడంతో తనకెమీ తెలియదంటున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించిన రవితేజ, ఇతర ముఠా సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa