ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి సూసైడ్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 17, 2021, 12:10 PM

ఓ 26 ఏళ్ల కుర్రాడు తన ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి కంగారుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముంది? ఏంటా స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో పెదవేగి మండలం నడిపల్లికి చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు గుంటూరు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ పని చేసుకుంటున్న ఆ కుర్రాడు గురువారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం అతడి ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ సందేశాన్ని చూసిన వెంటనే ఆందోళన చెంది ఇంటి నుండి బయటకు వెళ్లాడు. దీంతో కంగారుపడ్డ ఇంటి వారు ఫోన్ చేసినా తీయలేదు. చాలా సేపు ప్రయత్నించగా చివరకు ఫోన్ తీసిన ఆ కుర్రాడు తాను విజయరాయిలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్నానని అమ్మా .. నాన్నా నన్ను క్షమించండి నాకు కరోనా పాజిటివ్ వచ్చింది నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అతడిని వెతుక్కుంటూ వెళ్లగా అపస్మారక స్థితిలో గుర్తించారు. అంబులెన్స్ వచ్చే సరికి ఆ కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చినా తగు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ను జయించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఎవరూ ఇలా అధైర్య పడద్దని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa