ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్రాణవాయువు' కొరతతో ఆరుగురి మృతి!

national |  Suryaa Desk  | Published : Sun, Apr 18, 2021, 12:47 PM

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. షాదోల్‌ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ప్రాణవాయువు కొరతతో ఆరుగురు రోగులు మృతిచెందినట్లు సమాచారం. ఆక్సిజన్‌ లేకనే వారు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. కరోనాతోనే వారు మృతిచెందారని యాజమాన్యం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 11,269 కరోనా కేసులు నమోదయ్యాయి. 66 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు 4,491 మంది మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa