రాష్ట్రంలో 390 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని.. ప్రస్తుతం 360 టన్నులే అందుబాటులో ఉన్నట్లు ఏపీ వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ చర్యలపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పూర్తి స్థాయి ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది అన్నారు. మిగతా ఆక్సిజన్ తమిళనాడు, బళ్లారి నుంచి మనకు వస్తోంది’’ అని చెప్పారు. ఈ సమావేశంలో హోం మంత్రి సుచరిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa