ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది, ఇంటర్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 28, 2021, 12:36 PM

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని పదే పదే కోరుతూ వస్తున్నారు. పరీక్షల రద్దు అంశంపై ఇప్పటికే కొందరు కోర్టును సైతం ఆ్రశయించారు. ఇటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ చేతులు ఎత్తేస్తున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకింది దీంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు అంతా తాము తమ పిల్లలను స్కూళ్లకి పంపించలేమంటూ హెడ్ మాస్టార్లకు లేఖలు రాస్తున్నారు. ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణ కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రచారాలకు సీఎం జగన్ పుల్ స్టాప్ పెట్టారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభోత్సవవంలో మాట్లాడిన ఆయన.. పది, ఇంటర్ పరీక్షలపై క్లారిటీ ఇఛ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించే చర్యలు ఏపీ ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తులో పది, ఇంటర్ పరీక్షలు చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. సాధరణంగా పాస్ అని చెప్పేస్తే సరిపోదు అన్నారు. భవిష్యత్తులో ఏ కాలేజ్, లేదా ఉద్యోగాల్లో ఇంటర్వ్యూల కోసం వెల్లినప్పుడు కచ్చితంగా పది, ఇంటర్ మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటారని జగన్ అభిప్రాయపడ్డారు. అలాంటి సమయంలో విద్యార్థులు కేవలం పాస్ అనే సర్టిఫికేట్ చూపిస్తే ఎవరు అవకాశాలు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తే అన్నింటికన్నా తమ ప్రభుత్వానికి ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు.


 


చాలామంది పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. అలా పరీక్షలు రద్దు చేయండి అంటూ డిమాండ్ చేయడం అన్నిటికంటే చాలా సులభమన్నారు. అంటే పరోక్షంగా ఆయన లోకేష్ పేరును ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా పరీక్షలు రద్దు చేయడం అనేది విద్యార్థులకు నష్టం కలిగించే చర్యే అని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు అంతా పది, ఇంటర్ సర్టిఫికేట్లపైనే ఆధారపడి ఉంటుంది అన్నారు. అందుకే ఆ రెండు పరీక్షలను చాలా బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.


 


పరీక్షల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానముంటుంది అంటున్నారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa