ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 30, 2021, 08:32 AM

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 3,79,257కి చేరింది. ఇందులో 1,50,86,878 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,84,814 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3645 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,04,832కి చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కరోనా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో సమావేశం జరుగనుంది. సమావేశంలో వివిధ రాష్ట్రాలలో వైరస్ పరిస్థితులపై ప్రధాని సమీక్ష చేయనున్నారు. అదే సమయంలో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, టీకాలు, అవసరమైన ఔషధాలపై లభ్యత తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa