ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా ఎఫెక్ట్..అన్ని సరుకుల ధరలు పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 30, 2021, 05:42 PM

కరోనా కట్టడిలో భాగంగా వాణిజ్య, వ్యాపార సంస్థలు, దుకాణాలు పని వేళలు తగ్గించడంతో నిత్యావసర సరుకుల ధరలు మూడు రోజుల్లోనే 20 శాతం పెరిగాయి. కరోనా ప్రభావం సామాన్య, మధ్య తరగతి వర్గాలను కుంగదీస్తోంది. అధికారుల నియంత్రణ లేకపోతే ధరలు మరింత పెరిగి పేద వర్గాలు పస్తులు ఉండవలసిన పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. సరుకుల ధరలు విపరీతంగా పెరగడం పట్ల కృష్ణాజిల్లా తిరువూరు పట్టణంలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని ప్రజలు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa