కరోనా సెకెండ్ వేవ్లో ఉత్తరప్రదేశ్ విలవిల్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య సదుపాయాల దయనీయ పరిస్థితిపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టింది. యూపీలోని గ్రామాలు, చిన్న నగరాల్లో వైద్య వ్యవస్థ 'దైవాధీనం' (రామ్ భరోస్)గా మారిందని న్యాయమూర్తులు సిద్ధార్ధ్ వర్మ, అజిత్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. మీరట్ ఆసుపత్రిలో చేరిన 64 ఏళ్ల సంతోష్ కుమార్ అనే వ్యక్తి మృత్యువాత పడిన తీరును పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 22న ఆసుపత్రి బాత్రూంలో స్పృహ కోల్పోయిన సంతోష్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దర్యాప్తు నివేదక ప్రకారం, ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ను గుర్తుపట్టడంలో విఫలమయ్యారు. అతని ఫైల్ను కూడా కనిపెట్టలేకపోయారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తిగా పేర్కొంటూ అతని మృతదేహాన్ని బ్యాగులో ప్యాక్ చేసి ఆసుపత్రి నుంచి తరలించారు.
ఈ ఘటనను హైకోర్టు ధర్మాసనం ప్రస్తావిస్తూ, మీరట్లోని మెడికల్ కాలేజీలోనే ఇలాంటి దయనీయ పరిస్థితి ఉంటే, రాష్ట్రంలోని మొత్తం మెడికల్ వ్యవస్థ, ముఖ్యంగా చిన్న నగరాలు, గ్రామాల్లో పరిస్థితి 'దైవాధీనం' (రామ్ భరోస్)గానే చెప్పాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇలాంటి పట్టింపులేని ధోరణితో, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే అది తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని, అమాయకుల ప్రాణాలతో ఆటలాడుకోవడం సరికాదని మందలించింది. బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. గతంలో తాము జారీ చేసిన ఆదేశాలకు లోబడి తగినన్ని హెల్త్ కేర్ సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa