ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా 106 మరణాలు, 15,284 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 26, 2021, 11:00 AM

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,06,210 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 106 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,328 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 20,917 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా , ఇప్పటివరకు 13 లక్షల 97 వేల 859 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,98,023 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,87,49,201 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa