ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో అలజడి సృష్టిస్తున్న యాస్​ తుపాన్.. హై అలర్ట్ ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 26, 2021, 12:32 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్​.. తీరానికి చేరువైంది. బుధవారం మధ్యాహ్నం ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ " IMD " ప్రకటించింది. యాస్​ తుపాను.. ఒడిశాలోని ధర్మాకు 60 కి.మీ.ల దూరంలో, పారదీప్​కు 90కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర ధమ్రా – దక్షిణ బాలసోర్ " ఒడిశా " మధ్య ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇక యాస్ తుఫాన్ ప్రభావంతో భద్రక్​ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 


ఇక ఏపీలో కూడా యాస్ తుఫాన్ ప్రభావం కనిపించనుంది. దుగరాజపట్నం  " నెల్లూరు " నుంచి బారువ " శ్రీకాకుళం " వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొన్నారు. సముద్రంలో అలలు 2.5 – 5.0 మీటర్ల ఎత్తులో ఎగసి పడుతాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa