అమరావతి : తాను ప్రస్తుతం రాజకీయాలలో లేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐయామ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పౌరసన్మానానికి కృతజ్ణతలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. తాను ఏ పనినైనా మనస్ఫూర్తితో, కష్టపడి చేస్తానని వెంకయ్యనాయుడు చెప్పారు. రాజకీయాలలో తాను దశాబ్దాల పాటు చిత్తశుద్ధితో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేశానన్నారు. అదే విధంగా ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా తన విధులను చిత్తశుద్ధిగా నిర్వహిస్తానన్నారు. రాజ్యసభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా ప్రయత్నిస్తానని వెంకయ్య చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa